News May 24, 2024
నేడు మాచర్లకు పిన్నెల్లి సోదరులు?

AP: ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ మాచర్లకు వస్తారని అనుచరులు చెబుతున్నారు. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా అజ్ఞాతం వీడతారని తెలుస్తోంది. అల్లర్ల తర్వాత వీరు రాష్ట్రాన్ని వీడిన విషయం తెలిసిందే. మరోవైపు మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు.
Similar News
News February 8, 2025
‘వందే భారత్’లో ఫుడ్.. రైల్వే కీలక నిర్ణయం

వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వే శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారికి కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అయితే రాత్రి 9 గంటలలోపు మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలి. ప్రయాణాల్లో ఆహారం దొరకడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRCTC పేర్కొంది. క్వాలిటీ ఫుడ్ అందించాలని సంబంధింత విభాగాలను ఆదేశించింది.
News February 8, 2025
వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.
News February 8, 2025
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)