News November 7, 2024
పాక్-ఇంగ్లండ్ సిరీస్లో పిచ్లు ఓకే: ఐసీసీ

పాక్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో పాకిస్థాన్ పిచ్లు సంతృప్తికరంగానే ఉన్నాయని పేర్కొంటూ ఐసీసీ తాజాగా రేటింగ్ ఇచ్చింది. తొలి మ్యాచ్లో ముల్తాన్ పిచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. పాక్ 556, ఇంగ్లండ్ 823 రన్స్ చేశాయి. రెండో మ్యాచ్లో అదే పిచ్పై, మూడో మ్యాచ్లో రావల్పిండి పిచ్పై బంతి తొలి రోజు నుంచే స్పిన్ అయింది. దీంతో ఇంగ్లండ్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
Similar News
News February 1, 2026
మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ నిమ్స్లో వారం రోజులుగా చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. JAN 24న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి.
News February 1, 2026
ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ అరెస్ట్

AP: విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న మొహమ్మద్ ముజామిల్ అనే వ్యక్తిని చిత్తూరు-నాయుడుపేట NHపై అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో ఇతడికి సంబంధాలు ఉన్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కాగా గత నెల చిత్తూరు పర్యటనలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
News January 31, 2026
‘ధురంధర్’లో తెలుగు నటులు.. గ్రోక్ ఎంపిక ఇదే

‘ధురంధర్’ OTTలోకి రావడంతో నెట్టింట దానిపైనే చర్చ జరుగుతోంది. అందులోని క్యారెక్టర్లకు ఏ తెలుగు నటులు సెట్ అవుతారో చెప్పాలని ఓ నెటిజన్ ‘గ్రోక్’ను అడిగాడు. హంజా (రణ్వీర్ సింగ్)కు జూనియర్ ఎన్టీఆర్, రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)- రానా దగ్గుబాటి, మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)- ప్రభాస్, SP అస్లాం (సంజయ్ దత్)- వెంకటేశ్, యెలీనా (సారా అర్జున్)- సమంత, అజయ్ సన్యాల్ (మాధవన్)కు రామ్ చరణ్ అని చూపించింది.


