News April 25, 2024
మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి: CBN
AP: టీడీపీ మహిళలకు పుట్టినిల్లు అని, తాను మొదటి నుంచి మహిళా పక్షపాతిని అని చంద్రబాబు అన్నారు. ‘YCP పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెంచేశారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. స్థలం లేని వారికి 2, 3 సెంట్లు ఇప్పించి ఇళ్లు కట్టిస్తాం. మేం వచ్చాక రూ.4వేలు పెన్షన్ ఇస్తాం. YCPని బంగాళాఖాతంలో కలిపేయాలి. మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News January 21, 2025
ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..
అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.
News January 21, 2025
క్రికెట్ టూర్లలో ఫ్యామిలీ ఉండాల్సిందే: బట్లర్
క్రికెట్ టూర్లలో తమ వెంట కుటుంబం ఉండాల్సిందేనని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డారు. వారు వెంట ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ‘ఫ్యామిలీనే మాకు తొలి ప్రాధాన్యత. వారు మా వెంట ఉంటేనే ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. టూర్ల సమయంలో భార్యలు, కుటుంబసభ్యులు మాతో ఉండడంతో చాలా దృఢంగా ఉంటాం. క్రికెట్, ఫ్యామిలీని మేనేజ్ చేసే సత్తా ఇప్పటి క్రికెటర్లకు ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
News January 21, 2025
ఇన్వెస్టర్లకు ₹6లక్షల కోట్ల నష్టం.. కారణాలివే
బేర్స్ దెబ్బకు దేశీయ స్టాక్మార్కెట్లు రక్తమోడుతున్నాయి. ఆరంభం నుంచీ ఆటుపోట్లకు లోనవుతున్న బెంచ్మార్క్ సూచీలు ఇప్పుడు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 75,900 (-1200), నిఫ్టీ 23,039 (-310) వద్ద చలిస్తున్నాయి. దీంతో నేడు రూ.6L CR ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ 100% టారిఫ్స్ ప్రకటన, బలహీన క్యూ3 ఫలితాలు, BOJ వడ్డీరేట్ల పెంపు అంచనా, FIIs వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.