News February 15, 2025

14 ఏళ్లకే లక్ష మొక్కలు నాటింది

image

తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి సింగ్ లక్ష మొక్కలు నాటారు. ‘ప్రసిద్ధి ఫారెస్ట్ ఫౌండేషన్’ స్థాపించి ‘చెట్ల అమ్మాయి’గా ప్రసిద్ధి పొందారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఆమె మొక్కలు నాటారు. 110 ప్రాంతాల్లో 1.3 లక్షలకుపైగా వాటిని నాటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అడవుల కోసం ఆమె చేస్తున్న కృషికిగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం PM రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రకటించింది.

Similar News

News March 5, 2026

3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

image

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News March 5, 2026

US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

image

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.

News March 5, 2026

❤️నచ్చేశావ్ సంజూ..

image

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.