News July 19, 2024
91 టెస్టులు ఆడాడు.. ఒక్క టీ20 కూడా ఆడలేదు..!

వెస్టిండీస్ ఓపెనర్ క్రెగ్ బ్రాత్వైట్ది విచిత్ర పరిస్థితి. ఇప్పటివరకు ఆయన 91 టెస్టులు ఆడారు. కానీ ఒక్క T20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో 50కుపైగా టెస్టు మ్యాచ్లు ఆడి ఒక్క T20 కూడా ఆడని ఏకైక ప్లేయర్గా బ్రాత్వైట్ చరిత్ర సృష్టించారు. 2011 నుంచి ఆయన క్రికెట్ ఆడుతున్నా డొమెస్టిక్లోగానీ, అంతర్జాతీయంగాగానీ పొట్టి ఫార్మాట్లో బరిలోకి దిగలేదు.
Similar News
News November 10, 2025
పచ్చిపాలతో ముఖానికి మెరుపు

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్ను కాటన్ బాల్స్తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.
News November 10, 2025
రాహుల్ గాంధీకి పనిష్మెంట్.. 10 పుష్ అప్స్

మధ్యప్రదేశ్లోని పచ్మర్హిలో జరిగిన INC సమావేశానికి అగ్రనేత రాహుల్ గాంధీ 20ని.లు ఆలస్యంగా వెళ్లారు. లేటుగా వచ్చిన వాళ్లు పనిష్మెంట్ను ఎదుర్కోవాలని ఆ ప్రోగ్రామ్ చీఫ్ సచిన్ రావు సరదాగా చెప్పారు. దీంతో ఆయన సూచన మేరకు రాహుల్ 10 పుష్ అప్స్ తీసిన తర్వాత కుర్చీలో కూర్చున్నారు. దీంతో అక్కడున్నవారు చప్పట్లతో అభినందించారు. కాగా రాహుల్ గతంలోనూ పలు కార్యక్రమాల్లో పుష్ అప్స్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.
News November 10, 2025
ఢిల్లీ కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన

ఢిల్లీ వాయు కాలుష్యంపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ మీదుగా రాంచీకి వెళ్లా. ఎప్పటిలానే అక్కడి ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. గోవాలోని చిన్న గ్రామంలో నేను నివసిస్తున్నందుకు సంతోషిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇటీవల ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ పడిపోయిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాలు ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉన్నాయి.


