News July 19, 2024

91 టెస్టులు ఆడాడు.. ఒక్క టీ20 కూడా ఆడలేదు..!

image

వెస్టిండీస్ ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వైట్‌ది విచిత్ర పరిస్థితి. ఇప్పటివరకు ఆయన 91 టెస్టులు ఆడారు. కానీ ఒక్క T20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో 50కుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి ఒక్క T20 కూడా ఆడని ఏకైక ప్లేయర్‌గా బ్రాత్‌వైట్ చరిత్ర సృష్టించారు. 2011 నుంచి ఆయన క్రికెట్ ఆడుతున్నా డొమెస్టిక్‌లోగానీ, అంతర్జాతీయంగాగానీ పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగలేదు.

Similar News

News February 16, 2025

KCR బర్త్‌డే రోజున సామాజిక కార్యక్రమాలు: KTR

image

TG: BRS అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా FEB 17న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.

News February 16, 2025

WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.

News February 16, 2025

మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే

image

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్‌లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

error: Content is protected !!