News February 22, 2025

CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. SLBC టన్నెల్ ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా ఇప్పటికే NDRF, SDRF బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

Similar News

News December 28, 2025

సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

image

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్‌డ్యామ్స్, ఫామ్‌పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.

News December 28, 2025

CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

హైదరాబాద్‌లోని <>CCMB<<>>లో 10 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీఎస్సీ(BZC), ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ(నేచురల్ సైన్స్), NET, GATE, PhD (బయోఇన్ఫర్మాటిక్స్/జెనిటిక్స్/లైఫ్ సైన్స్/అల్లైడ్ సైన్స్, మైక్రో బయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in

News December 28, 2025

కోచ్‌ మార్పుపై BCCI క్లారిటీ

image

టెస్ట్ జట్టు కోచ్‌గా గంభీర్‌ను పక్కనపెట్టి లక్ష్మణ్‌ను తీసుకొంటారని వస్తున్న వార్తలను BCCI ఖండించింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది సౌతాఫ్రికా(0-2), న్యూజిలాండ్‌(0-3)తో టెస్టు సిరీస్‌లు వైట్‌వాష్‌ కావడంతో గంభీర్ కోచింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు 12ఏళ్ల తర్వాత IND స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ కోల్పోయింది. దీంతో గంభీర్ ప్రయోగాలే ఓటమికి కారణమని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.