News November 17, 2024
కొత్త చిత్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు

2002లో జరిగిన గోద్రా రైలు దుర్ఘటనకు దారితీసిన పరిణామాల కథాంశంగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ ఘటన చుట్టూ ఏర్పడిన వివాదాన్ని కొట్టిపారేస్తూ చిత్రంలో నిజాలను వెల్లడించినందుకు అభినందించారు. నకిలీ కథనాలు తక్కువకాలం మాత్రమే మనుగడ సాధించగలవని వ్యాఖ్యానించారు. సామాన్యులు సైతం చూడదగిన పద్ధతిలో నిజాలు బయటకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
మిడిల్ ఈస్ట్లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.
News March 5, 2026
‘నేను ఇంటికి వెళ్లాలి’.. వెస్టిండీస్ కోచ్ ఆవేదన!

T20 WC నుంచి వెస్టిండీస్ నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గగనతల ఆంక్షలతో వారు వెళ్లేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలో తనకు ఇంటికి వెళ్లాలని ఉందంటూ వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు వెళ్తామో చెప్పండి. ఈ రోజా? రేపా? వచ్చే వారమా? ఇప్పటికే 5 రోజులు అవుతోంది’ అని ట్వీట్ చేశారు.
News March 5, 2026
10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

బిహార్లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.


