News December 12, 2024
గుకేశ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ప్రపంచ చెస్ ఛాంఫియన్గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.
Similar News
News January 16, 2026
రాష్ట్రంలో 424 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

EdCIL APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 18) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+అలవెన్సులు రూ.4వేలు చెల్లిస్తారు. సైట్: www.edcilindia.co.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 16, 2026
తమిళ ఆడియన్సే అల్లు అర్జున్ టార్గెట్?

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజ్తో సినిమాలు ప్లాన్ చేశారు. ‘పుష్ప’తో ఇప్పటికే నార్త్లో ఆయనకు మంచి ఆదరణ ఏర్పడింది. సౌత్లో AP, TGతో పాటు కేరళ, కర్ణాటకలో ఫాలోయింగ్ ఉంది. ఇక మిగిలింది TN కావడంతో అక్కడి ఆడియన్స్నే బన్ని టార్గెట్ చేశారని టాక్. తమిళ స్టార్ డైరెక్టర్లు కావడంతో ఈ సినిమాలు అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానున్నాయి. ఇవి హిట్టయితే బన్నీకి తిరుగులేనట్లే.
News January 16, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


