News December 12, 2024

గుకేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

ప్రపంచ చెస్ ఛాంఫియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.

Similar News

News January 16, 2025

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.550 పెరిగి రూ.80,620కి చేరింది. 22క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.73,900 పలుకుతోంది. కేజీ వెండి రూ.100 పెరిగి రూ.1,01,100కు చేరింది.

News January 16, 2025

ISRO మరో రికార్డ్: SpaDeX విజయవంతం!

image

ప్రతిష్ఠాత్మక SpaDeX ప్రయోగం విజయవంతమైనట్టు ISRO వర్గాలు తెలిపాయి. అంతరిక్షంలో 2 శాటిలైట్లను డాక్ చేసినట్టు వెల్లడించాయి. త్వరలోనే సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నాయి. DEC 30న PSLV C60 రాకెట్లో SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) శాటిలైట్లను ఇస్రో పంపింది. JAN 12న 3 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చి పరిస్థితి అనుకూలంగా లేదని మళ్లీ సురక్షితమైన దూరానికి పంపింది. తాజాగా సక్సెస్ చేసింది.

News January 16, 2025

ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్: 6 వారాల తర్వాత ఏం జరుగుతుందంటే?

image

ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్ 3 దశల్లో కొనసాగుతుందని హమాస్ విడుదల చేసిన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. మొదటి దశ 6 వారాలు ఉంటుంది. వారానికి కొందరు చొప్పున చివరి వారం బందీలందరినీ హమాస్ విడుదల చేస్తుంది. రెండో వారం మిలిటరీ ఆపరేషన్స్ శాశ్వతంగా ఆగిపోతాయి. ఇజ్రాయెల్, గాజా పరస్పరం పౌరులు, సైనికుల్ని విడుదల చేస్తాయి. మూడో దశలో మృతదేహాలు, అస్థికలను ఇస్తారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో గాజా పునర్నిర్మాణం మొదలవ్వాలి.