News November 13, 2024

ప్రధాని ఒక జడ్జిలా ఉండాలి: CM రేవంత్

image

TG: దేశ ప్రధాని ఒక జడ్జిలా ఉండాలని CM రేవంత్ అన్నారు. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదని, ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్‌కు మళ్లిస్తున్నారని, అందుకు సెమీకండక్టర్ పరిశ్రమ ఉదాహరణ అన్నారు.

Similar News

News December 9, 2025

NIT వరంగల్‌లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>NIT<<>> వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడవును పొడిగించింది. అప్లైకి DEC 12 ఆఖరు తేదీ కాగా.. DEC 31వరకు పొడిగించారు. పోస్టును బట్టి PhD, ME, ఎంటెక్, MSc, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty

News December 9, 2025

IndiGo: నెట్‌వర్క్ పునరుద్ధరణ.. నేడు 250 సర్వీసులు రద్దు!

image

ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తాజాగా నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా దేశవ్యాప్తంగా నేడు 250కిపైగా సర్వీసులు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల ఖాతాల్లో రూ.827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. గోవా, అహ్మదాబాద్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని HYD, విశాఖలో ఇవాళ పలు సర్వీసులు రద్దయ్యాయి.

News December 9, 2025

స్టార్ బ్యాటర్ అంజుమ్ చోప్రా గురించి తెలుసా?

image

ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న అంజుమ్ చోప్రా గతంలో భారత జట్టులో కీలకపాత్ర పోషించారు. 18 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఈ దిల్లీ క్రికెటర్‌ IND తరఫున 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. స్టార్ బ్యాటర్ అయిన ఆమె నాలుగు ప్రపంచ కప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం మీద 127 వన్డేలు, 12 టెస్టులు, 18 టీ20లు ఆడారు. 2007లో అర్జున అవార్డు, 2014 పద్మశ్రీ అందుకున్నారు.