News November 13, 2024

ప్రధాని ఒక జడ్జిలా ఉండాలి: CM రేవంత్

image

TG: దేశ ప్రధాని ఒక జడ్జిలా ఉండాలని CM రేవంత్ అన్నారు. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదని, ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్‌కు మళ్లిస్తున్నారని, అందుకు సెమీకండక్టర్ పరిశ్రమ ఉదాహరణ అన్నారు.

Similar News

News December 8, 2025

చలి పంజా.. బయటికి రావద్దు!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. వచ్చే 2-3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, MDK, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది.

News December 8, 2025

రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు

image

TG: పార్లమెంటు సభ్యులపై <<18438395>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. బ్రిజ్‌లాల్, గోపాలస్వామి ఆమెపై రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాటిని ఆయన ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇటీవల ఆమె పార్లమెంటుకు పెంపుడు కుక్కను తీసుకెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పరోక్షంగా ఎన్డీఏ సభ్యులను ఉద్దేశిస్తూ కరిచే వాళ్లు లోపల ఉన్నారని వ్యాఖ్యానించారు.

News December 8, 2025

రూ.500 కోట్ల కామెంట్స్.. కాంగ్రెస్ నుంచి సిద్ధూ భార్య సస్పెండ్

image

సీఎం పోస్ట్ కొనుక్కోవడానికి తమ వద్ద రూ.500 కోట్లు లేవంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి పంజాబ్ కాంగ్రెస్ తొలగించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అమరిందర్ సింగ్ తెలిపారు. కాగా ఆమె వ్యాఖ్యలు పంజాబ్‌లో తీవ్ర దుమారం రేపడంతో తన కామెంట్స్‌ను వక్రీకరించారని కౌర్ అన్నారు.