News July 10, 2024
పీసీబీ దస్త్రాల దహనంపై పోలీసుల విచారణ

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో పీసీబీ దస్త్రాల దహనం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో 7 విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్లు బయటకు వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారిస్తున్నారు. కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది ఇస్తున్న సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
‘పెద్ది’పై క్రేజీ అప్డేట్.. చరణ్తో మృణాల్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్తో అలరించబోతున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీ కోసం మేకర్స్ అడిగిన వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. AR రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ సిద్ధం చేయగా ఈ సాంగ్ను చాలా గ్రాండ్గా చిత్రీకరించబోతున్నారని టాక్. ‘సీతారామం’తో తెలుగువారి మనసు గెలుచుకున్న ఈ భామ చరణ్తో కలిసి స్టెప్పులేయనుందనే వార్త ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది.
News January 23, 2026
వరుసగా 3 రోజులు సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.
News January 23, 2026
APPLY NOW: SACONలో 36 పోస్టులు

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<


