News July 10, 2024
పీసీబీ దస్త్రాల దహనంపై పోలీసుల విచారణ

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో పీసీబీ దస్త్రాల దహనం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో 7 విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్లు బయటకు వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారిస్తున్నారు. కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది ఇస్తున్న సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

మకరవిళక్కు పండుగ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. పవిత్రమైన దీపాన్ని వెలిగించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పూజల నేపథ్యంలో స్వామి దర్శనానికి లక్షల మంది తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మండల పూజ తర్వాత శనివారం రాత్రి ఆలయాన్ని <<18690795>>మూసివేసిన<<>> విషయం తెలిసిందే.
News December 30, 2025
కంకి ఎర్రనైతే కన్ను ఎర్రనౌతుంది

వరి పంట పండే సమయంలో కంకి (వరి వెన్ను) సహజంగా బంగారు వర్ణంలో ఉండాలి. కానీ, విపరీతమైన వర్షాలు కురిసినా లేదా ఏదైనా తెగులు సోకినా కంకులు ఎర్రగా మారిపోతాయి. దీనివల్ల ధాన్యం నాణ్యత దెబ్బతింటుంది. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడం చూసి రైతు కన్ను ఎర్రనౌతుంది (అంటే దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి). పంట దిగుబడి, స్థితికి.. రైతు మనస్తత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.
News December 30, 2025
119 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


