News January 30, 2025
పాపం చిన్నారి.. ఐదేళ్లుగా పాలు, నీళ్లే ఆహారం

AP: ప్రకాశం(D) మార్కాపురంలో రక్షణ అనే చిన్నారి ఐదేళ్లుగా పాలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. అన్నప్రాసన రోజు పేరెంట్స్ అన్నం పెట్టగా వాంతి చేసుకుంది. నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు అన్నవాహిక, పెద్దపేగు మూసుకుపోయాయని, 10 లక్షల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి అని వైద్యులు చెప్పారు. ఆపరేషన్కు ₹8L ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని తండ్రి భాస్కర్ వేడుకుంటున్నాడు.
Similar News
News February 10, 2025
’మహామండలేశ్వర్‘ పదవికి మమత రాజీనామా

తాను కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ నటి మమతా కులకర్ణి ప్రకటించారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. కాగా 90ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఓ డ్రగ్స్ రాకెట్లోనూ ఆమె పేరు వినిపించింది. ఇటీవల మహాకుంభమేళాలో ఆమె కిన్నర్ అఖాడాలో చేరి సన్యాసినిగా మారారు. కానీ దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
News February 10, 2025
అత్యధిక ఫాలోవర్లున్న ఇన్స్టా అకౌంట్స్ ఇవే

ఇన్స్టాగ్రామ్-685 మిలియన్లు
క్రిస్టియానో రొనాల్డో – 649 మిలియన్లు
లియోనెల్ మెస్సీ – 505 మిలియన్లు
సెలీనా గోమెజ్- 422 మిలియన్లు
డ్వేన్ జాన్సన్ (రాక్) – 395 మిలియన్లు
కైలీ జెన్నర్ – 394 మిలియన్లు
అరియానా గ్రాండే – 376 మిలియన్లు
*ఇండియాలో విరాట్ కోహ్లీ (270 మిలియన్లు) అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్నారు.
News February 10, 2025
రాజకీయ లబ్ధి కోసమే లడ్డూ ఆరోపణలు: అంబటి

AP: రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కూడా వంత పాడుతున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు వచ్చాకే AR సప్లైస్ నెయ్యి సరఫరా చేసింది. మరి మా హయాంలో లడ్డూ ప్రసాదం ఎలా కల్తీ అవుతుంది? లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని పచ్చి అబద్ధం ఆడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.