News December 16, 2024
ప్రసవం తర్వాత కోలుకునేలా సంరక్షణ కేంద్రాలు!
జననాలను పెంచేందుకు సౌత్ కొరియా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. గర్భిణులను డెలివరీ సమయంలో, ప్రసవించిన తర్వాత కంటికి రెప్పలా చూసుకునేందుకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. ఇక్కడ తాజా భోజనం, ఫేషియల్, మసాజ్, నర్సింగ్ సేవలు ఉంటాయి. కేవలం పిల్లలకు పాలు ఇవ్వడం, రెస్ట్ తీసుకోవడమే తల్లుల పని. వీటికి ఆదరణ పెరగడంతో గర్భం దాల్చగానే వెంటనే బుక్ చేసుకుంటున్నారు.
Similar News
News January 20, 2025
కొత్త ఫోన్తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా
బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కొరియర్లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.
News January 20, 2025
సంజయ్ రాయ్కి నేడు శిక్ష ఖరారు
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
News January 20, 2025
రద్దీగా మారిన హైదరాబాద్
నేటి నుంచి ఆఫీస్లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.