News May 11, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ కోతలు: కేసీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత జోష్ కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం కనిపించలేదు. శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేసింది. ఆ పార్టీ చేసిన తప్పులే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను కాటేస్తాయి’ అని విమర్శించారు.
Similar News
News February 6, 2025
అందరి ముందు బట్టలు విప్పేసిన భార్యను సమర్థించిన భర్త

గ్రామీ అవార్డుల వేడుకలో అమెరికా స్టార్ సింగర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సారి <<15346210>>నగ్నంగా<<>> కెమెరాలకు పోజులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తన భార్య చేసిన ఘనకార్యాన్ని కాన్యే సమర్థించారు. తన భార్య స్మార్ట్, టాలెంటెడ్, బ్రేవ్ అని వెనకేసుకొచ్చారు. తమపై విమర్శలొచ్చినప్పటికీ ఆరోజు అత్యధికంగా గూగుల్లో శోధించిన వ్యక్తిగా సెన్సారి నిలిచిందన్నారు. ఇది గ్రామీ అవార్డులను సైతం ఓడించిందని భార్యను కొనియాడారు.
News February 6, 2025
డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు

224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero
News February 6, 2025
బీజేపీకి 45-55 సీట్లు: యాక్సిస్ మై ఇండియా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. బీజేపీ 45-55, ఆప్ 15-25, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0-1 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.