News January 25, 2025
గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సాయుధ బలగాల్లో 93 మందికి గ్యాలంటరీ పురస్కారాలు ప్రకటించారు. 11 మందిని మరణానంతరం గ్యాలంటరీ అవార్డులకు ఎంపిక చేశారు. ఇద్దరికి కీర్తి చక్ర, 14 మందికి శౌర్యచక్ర, 66 మందికి సేనా మెడల్స్ ప్రకటించారు.
Similar News
News February 19, 2025
CHAMPIONS TROPHY: 12 వేల మందితో భారీ భద్రత!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.
News February 19, 2025
శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.
News February 19, 2025
ఢిల్లీ CM ఎన్నిక: అబ్జర్వర్లను నియమించిన BJP

ఢిల్లీ CM అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. PM మోదీ నివాసంలో సమావేశమైన పార్లమెంటరీ ప్యానెల్ రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధన్ఖడ్ను అబ్జర్వర్లుగా నియమించింది. 7PMకు BJP MLAలు సమావేశం అవుతారు. అక్కడ వీరిద్దరూ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. అంటే రాత్రి వరకు అభ్యర్థి ఎవరో తేలే అవకాశం లేదు. మరోవైపు DCC చీఫ్, కేజ్రీవాల్, ఆతిశీని ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది.