News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Similar News
News March 26, 2026
GNT: ముగ్గురు స్నేహితులకు 10 ఏళ్ల జైలు..!

గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు హన్మకొండ న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష్మణరావు(పేరేచర్ల) చైతన్య కుమార్ (పిడుగురాళ్ల), సైదులు(కారంపూడి) ముగ్గురు స్నేహితులు. వీరంతా ఆల్ప్రాజోలం మాత్రలతో కేజీ పొడిని తయారు చేసి న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు 2023లో హైదరాబాద్ బయల్దేరగా అప్పట్లో హన్మకొండ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది.
News March 26, 2026
RCBకి కొత్త ఓనర్లు.. విజయ్ మాల్యా అభినందనలు

RCB కొత్త యజమానులకు ఒకప్పటి ఓనర్, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. 2008లో ₹450కోట్లు పెట్టి ఈ ఫ్రాంచైజీ కొన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని.. కానీ అదే ₹16,500Cr విలువైన బ్రాండ్గా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. RCB ఎప్పటికీ తన డీఎన్ఏలో భాగమని.. యువ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం చెరగని జ్ఞాపకమని అన్నారు. తన హయాంలో, ఆ తర్వాతా RCBకి మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్కు ధన్యవాదాలు తెలిపారు.
News March 26, 2026
‘హంద్రీ-నీవా’ రెండో దశకు గ్రీన్ సిగ్నల్

AP: హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డు/రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ, ఆధునికీకరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టనున్నారు.


