News July 5, 2024
అమరావతికి రానున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ
AP: దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తైతే 5వేల మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించొచ్చు.
Similar News
News July 8, 2024
సెలబ్రెటీల వెడ్డింగ్కు జోసెఫ్ రాధిక్ ఉండాల్సిందే!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకను ఇంటర్నేషనల్ అవార్డీ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధిస్తున్నారు. ఈయన రోజుకు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారట. కత్రినా కైఫ్- విక్కీ, కోహ్లీ – అనుష్క, సిద్ధార్థ్- కియారా వివాహాలకు పనిచేశారు. కార్పొరేట్లో మూడేళ్లు పని చేశారు. ఫొటోస్ తీయడంలో సంతృప్తి ఉండటంతో 2010లో ఫొటోగ్రాఫర్గా మారారు. ఇప్పుడు సెలబ్రెటీలు సైతం కోరుకునేంత ఎత్తుకు ఎదిగారు.
News July 8, 2024
కొడాలి నానికి హైకోర్టులో ఊరట
AP: మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
News July 8, 2024
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు
సందేశ్ఖాలీ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి చురకలంటించింది. ఆ ఘటనపై CBIతో దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ‘ఒక వ్యక్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?’ అని ప్రశ్నించింది.