News August 10, 2025
భారీగా పడిపోయిన ధరలు

అమెరికా టారిఫ్ల ప్రభావం ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతులు చేసే APలో ఆక్వా రంగంపై పడింది. ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉమ్మడి గోదావరి, కృష్ణా, GNT, ప్రకాశం, NLR జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సుంకం పెంచుతున్నట్లు ఆయన చెప్పగానే ఎగుమతిదారులు రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. 25 కౌంట్ KG రొయ్య ధర ₹565 నుంచి ₹430కు తగ్గింది. మిగతా వాటి ధరలూ KGపై ₹35-80 మేర తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News August 11, 2025
జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో PM మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలను మోదీకి జెలెన్స్కీ వివరించారు. ‘శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉంది. శాంతియుత పరిష్కారానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఉక్రెయిన్కు భారత్ సహకారం కొనసాగుతుంది. భవిష్యత్లోనూ సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని మోదీ భరోసా ఇచ్చారు. కాగా వచ్చే సెప్టెంబర్లో ఇరువురు నేతలూ భేటీ కానున్నారు.
News August 11, 2025
అరుదైన వ్యాధి: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!

రాజస్థాన్లో మోడ్రన్ కుంభకర్ణుడిగా పేరుగాంచిన పుర్ఖారామ్ అనే 46 ఏళ్ల వ్యక్తి నెలలో 25 రోజులు నిద్రపోయే ఉంటారు. ఆయనకు 23 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. యాక్సిస్ హైపర్సోమ్నియా అనే ఈ నరాల సంబంధిత వ్యాధి వల్ల ఆయన ఏకధాటిగా నిద్రపోతుంటారు. మిగిలిన ఐదు రోజులు మాత్రమే తన వ్యాపారం చేసుకుంటున్నారు. నిద్రలోనే కుటుంబీకులు అతనికి తినిపించడం, స్నానం చేయించడం చేస్తుంటారు.
News August 11, 2025
రాష్ట్రంలో లాజిస్టిక్ కార్పొరేషన్: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రాన్ని సరకు రవాణా మార్గాలకు కేంద్రంగా తయారు చేస్తానని CM చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం నౌకా నిర్మాణ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతులపై అధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘కార్గో హ్యాండ్లింగ్ కోసం లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. పోర్టులు, ఎయిర్పోర్టులను ఎకనమిక్ హబ్గా తీర్చిదిద్దుతాం. పెట్టుబడులు రాబట్టేందుకు మారిటైమ్ పాలసీిని మారుస్తాం’ అని పేర్కొన్నారు.