News January 4, 2025
8న విశాఖకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

AP: ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆ రోజున సా.4.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ గంటసేపు PM సభ కొనసాగనుంది. విశాఖ రైల్వే జోన్, NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రా.7 గంటలకు భువనేశ్వర్కు బయలుదేరుతారు.
Similar News
News February 18, 2026
సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్సీక్కు పోటీగా

ఇటీవల <<19088829>>అక్యూరసీలో<<>> చాట్జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.
News February 18, 2026
మరోసారి భారత్ vs పాక్?

పాకిస్థాన్ సూపర్-8కు క్వాలిఫై కావడంతో T20WCలో మరోసారి భారత్తో తలపడే అవకాశం ఉంది. భారత్ గ్రూప్-1, పాక్ గ్రూప్-2లో ఉండటం వల్ల సూపర్-8లో అది సాధ్యం కాదు. కానీ సూపర్-8లో గ్రూప్-1లో భారత్ ఫస్ట్, గ్రూప్-2లో పాక్ సెకండ్ వస్తే సెమీస్లో తలపడొచ్చు. భారత్ సెకండ్, పాక్ ఫస్ట్ వచ్చినా సాధ్యమే. ఒకవేళ రెండు జట్లు వేర్వేరు సెమీస్లో నెగ్గితే కొలంబో వేదికగా IND vs PAK ఫైనల్ చూసే ఛాన్స్ ఉంటుంది.
News February 18, 2026
పిల్లలు వద్దు బొమ్మలే ముద్దు అంటున్న చైనా జెన్జీ

జననాల రేటు తగ్గిపోతున్న చైనాలో జెన్జీ మహిళలు పిల్లల కంటే బొమ్మలే మేలంటున్నారు. తమకు నచ్చిన బొమ్మను డిజైన్ చేయించుకుని దానినే తమ బిడ్డగా లాలించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నారు. పిల్లలను 18ఏళ్ల వరకు పెంచేందుకు దాదాపు రెండున్నర లక్షల డాలర్లపైనే అవుతుందని.. అదే బొమ్మ అయితే 200-800 డాలర్లలో దొరికేస్తుందని అంటున్నారు. దీని వల్ల తమ కెరీర్కు కూడా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.


