News May 10, 2024
తెలుగులో ప్రధాని మోదీ ప్రసంగం

‘హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం’ అంటూ HYD LB స్టేడియంలో ప్రధాని మోదీ తొలుత తెలుగులో ప్రసంగించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామంటోంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. జూన్ 4న దేశం గెలుస్తుంది. శత్రువులు ఓడిపోతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News February 12, 2026
చిత్తూరు: ఓటర్ల జాబితాకు కసరత్తు!

జిల్లాలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పుంగనూరు, నగరి, పలమనేరు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పాలకమండలి పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందో తెలియాల్సి ఉంది. చిత్తూరులో 50 డివిజన్లు, పలమనేరు మున్సిపాలిటీలో 26, నగరిలో 29, కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా మార్చి 9న ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు చర్యలు చేపట్టారు.
News February 12, 2026
‘బంగారు తీగ’ కలుపుతో అపరాల పంటకు ముప్పు.. నివారణ ఎలా?

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.
News February 12, 2026
‘బంగారు తీగ’ కలుపుతో అపరాల పంటకు ముప్పు.. నివారణ ఎలా?

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.


