News December 23, 2024
ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన
AP: ప్రధాని మోదీ వచ్చే నెల 8న అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 13, 2025
నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్
హీరోయిన్ అన్షు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావుపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ఛైర్పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. కాగా ‘అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకు సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా’ అని త్రినాథరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News January 13, 2025
INDvsPAK క్రికెట్ పోరుపై డాక్యుమెంటరీ
క్రికెట్లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే దానినో యుద్ధంలా చూస్తారు. క్రికెట్ చరిత్రలో దాయాదుల పోరు గురించి NETFLIX ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేందుకు వెళ్తోన్న పోస్టర్ను రిలీజ్ చేసింది. INDvsPAK మ్యాచుల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.
News January 13, 2025
అక్షరాస్యత రేటులో 1% వృద్ధితో 25% పెరిగిన మహిళల ఓటింగ్
అక్షరాస్యత రేటులో ఒకశాతం పెరుగుదల మహిళల ఓటింగును 25% పెంచిందని SBI నివేదిక పేర్కొంది. 2019తో పోలిస్తే 2024లో 1.8 కోట్ల మహిళా ఓటర్లు పెరిగారు. అందులో 45 లక్షల వృద్ధికి అక్షరాస్యతే కారణమంది. ముద్రా వంటి స్కీములతో 36లక్షలు, పారిశుద్ధ్యం వల్ల 21లక్షలు, PMAY వల్ల 20లక్షల స్త్రీ ఓటర్లు పెరిగారని తెలిపింది. అక్షరాస్యత, ఉపాధి, గృహ యాజమాన్యం, విద్యుత్, నీరు వంటివి సానుకూల ప్రభావం చూపాయని వెల్లడించింది.