News March 18, 2024

నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ రాక

image

TG: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనుండగా.. సభ ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News October 14, 2025

వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

image

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?

News October 14, 2025

రాశులు చెబుతున్న జీవిత పాఠాలు

image

మేషంలా తినాలి. వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించాలి. మిథునంలా కలిసిపోవాలి. కర్కాటకంలా పట్టు విడవకూడదు. సింహంలా పరాక్రమించాలి. కన్యలా సిగ్గుపడాలి. తులలా సమన్యాయం పాటించాలి. వృశ్చికంలా చెడుపై కాటేయాలి. ధనస్సులా లక్ష్యాన్ని ఛేదించాలి. మకరంలా దృఢంగా పట్టుకోవాలి. కుంభంలా నిండుగా ఉండాలి. మీనంలా సంసార సాగరంలో జీవించాలి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను <<-se_10008>>జ్యోతిషం<<>> కేటగిరీకి వెళ్లి చూడొచ్చు.

News October 14, 2025

తిరుమల: సీఐడీ విచారణ మొదలు

image

AP: HC ఆదేశాలతో తిరుమల ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణను CID ప్రారంభించింది. పరకామణి, ఆపై చోరీ కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ PSలో రికార్డులను చెక్ చేసింది. CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 2023 MARలో 920డాలర్లు దొంగిలిస్తూ TTD ఉద్యోగి రవి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై TTD పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదని పిల్ దాఖలు కాగా హైకోర్టు విచారణకు ఆదేశించింది.