News November 27, 2024

మరో వినోద్ కాంబ్లీలా మారిన పృథ్వీషా?

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా మరో వినోద్ కాంబ్లీలా మారిపోయారు. నెక్ట్స్ సచిన్ అని అందరూ అనుకుంటుండగానే పాతాళానికి పడిపోయారు. దేశవాళీ, భారత జట్టులో చోటు కోల్పోవడం, నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుండటంతో ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపలేదు. ఆయనపై కనీసం రూ.75 లక్షలు వెచ్చించేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. క్రమశిక్షణ లేకపోవడంతో అప్పట్లో భారత మాజీ క్రికెటర్ కాంబ్లీకి కూడా ఇదే గతి పట్టింది.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 24, 2025

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.

News November 24, 2025

కర్నూల్ ప్రిన్సిపల్‌కు వోసా అప్రిషియేషన్ అవార్డు

image

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్‌పి హెచ్‌ఎస్‌లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్‌.నాగస్వామి నాయక్‌కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.