News March 7, 2025
ఆస్తులు అమ్మేసిన ప్రియాంక చోప్రా

నటి ప్రియాంక చోప్రా వెస్ట్ ముంబై అంధేరిలో ఉన్న తన ఆస్తులను అమ్మేశారు. ఒబెరాయ్ స్కై గార్డెన్స్లో ఆమెకు విలాసవంతమైన 4 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని రూ.16.17కోట్లకు విక్రయించారు. గతంలోనూ ఆమె ముంబైలోని 2 ఫ్లాట్లను అమ్మేశారు. ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్జోనస్, కుమార్తె మేరీ చోప్రాతో కలిసి లాస్ ఏంజెలిస్లో ఉంటున్నారు. అందువల్లే ఆమె ముంబైలో ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 27, 2025
‘రామ జన్మభూమి’ ఎడిషన్ వాచ్తో సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రామ జన్మభూమి’ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 30న థియేటర్లలో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ ఫొటో షేర్ చేశారు. వాచ్లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి.
News March 27, 2025
డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం.. పవన్ సానుభూతి

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News March 27, 2025
ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్లైన్స్కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.