News October 3, 2024
రూ.500 బోనస్పై నేడు విధివిధానాలు!
AP: ఈ సీజన్ నుంచి సన్నబియ్యం రకాలకు క్వింటాకు ₹500 బోనస్ చెల్లించే అంశంపై నేడో, రేపో విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించనుంది. రైతులకు మద్దతు ధర(కామన్ రకానికి ₹2,300, గ్రేడ్-Aకు ₹2,320), బోనస్ను విడివిడిగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సన్నాల దిగుబడి 88 లక్షల టన్నులు కాగా, కొనుగోలు కేంద్రాలకు 49 లక్షల టన్నులు వస్తాయని అంచనా. ₹500 చొప్పున చెల్లిస్తే ₹2,455 కోట్ల ఖర్చవుతుంది.
Similar News
News October 10, 2024
సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..
భారత్ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
News October 10, 2024
ఈనెల 13 నుంచి రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి పర్యటన భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది. పర్యటనలో భాగంగా ముర్ము ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలవనున్నారు.
News October 10, 2024
‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం
AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.