News March 4, 2025
దుబాయ్లోనే నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి

సినీ నిర్మాత <<15577363>>కేదార్ సెలగంశెట్టి<<>> అంత్యక్రియలు దుబాయ్లో జరిగాయి. ఆయన మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని అక్కడి పోలీసులు విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని భార్య రేఖా వీణకు అప్పగించారు. ఇండియాలో రాజకీయ దుమారం రేగుతుందని అక్కడే దహనసంస్కారాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కేదార్ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదని సమాచారం.
Similar News
News March 27, 2025
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
News March 27, 2025
బైక్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. నేరుగా A/Cకి డబ్బులు!

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ రైడింగ్, క్యాబ్ బుకింగ్ కంపెనీల ఆధిపత్యానికి ఇక గండి పడనుంది. వీరికి అధిక కమిషన్లు చెల్లిస్తూ నష్టపోతున్న డ్రైవర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. మధ్యవర్తులు లేకుండా వారు నేరుగా లబ్ధి పొందేలా త్వరలో ‘సహకార ట్యాక్సీ’ యాప్ను తీసుకొస్తామని లోక్సభలో సహకార మంత్రి అమిత్షా ప్రకటించారు. ఇందులో బైకులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, ఫోర్వీలర్స్ను సహకార సంస్థలే నమోదు చేస్తాయి.
News March 27, 2025
కునాల్కు మద్దతుగా అభిమానులు..రూ. లక్షల్లో విరాళాలు

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు తన అభిమానుల నుంచి రూ.లక్షల్లో ఆర్థిక సాయం అందుతోంది. విదేశాల నుంచి ఒక అభిమాని రూ.37,000 పంపించిన ఫోటోని ఓ అభిమాని Xలో షేర్ చేశారు. యూట్యూబ్ ‘సూపర్ థాంక్స్’ ఫీచర్ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు. కునాల్పై కేసు నమోదైన నేపథ్యంలో లీగల్ ఖర్చుల అవసర నిమిత్తం అభిమానులు డబ్బు పంపిస్తున్నారు. DY.cm ఏక్నాథ్ శిండేపై కామెడీ స్కిట్ చేసినందుకు కునాల్ పై కేసు నమోదైంది.