News July 11, 2024
10 ఎకరాలలోపే ‘రైతు భరోసా’ ఇవ్వండి: రైతు సంఘాలు

TG: ‘రైతు భరోసా’ పథకాన్ని 10 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న వారికే ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికీ ఇవ్వాలన్నారు. ఖమ్మంలో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి అధ్వర్యంలోని సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 10 ఉమ్మడి జిల్లాల అభిప్రాయాలపై నివేదిక రూపొందించి అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు.
Similar News
News February 14, 2025
MLC ఎలక్షన్స్: బరిలో 90 మంది

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
News February 14, 2025
భారత్ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.
News February 14, 2025
పరీక్షల కన్నా జీవితం పెద్దది: అదానీ

JEEలో ఫెయిల్ అయినందుకు UPలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గౌతమ్ అదానీ విచారం వ్యక్తం చేశారు. ‘పరీక్షల కంటే జీవితం పెద్దది. ఈ విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలకు వివరించాలి. నేను కూడా చదువులో, జీవితంలో చాలాసార్లు ఫెయిలయ్యాను. కానీ ప్రతీసారి జీవితం నాకు కొత్త మార్గాన్ని చూపింది. వైఫల్యాన్ని మీ చివరి గమ్యస్థానంగా పరిగణించవద్దు. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.