News June 21, 2024
పీఎస్యూ స్టాక్స్ జోరు.. 10 సెషన్లలో ₹7లక్షల కోట్ల లాభం
ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నా ఆ ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్పై పెద్దగా కనిపించలేదు. జూన్ 4-19 మధ్య 10 ట్రేడింగ్ సెషన్లలో ఈ PSU స్టాక్స్ ₹7,23,823 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. దీంతో BSEలోని 56 PSU స్టాక్స్ సంపద ₹68,03,059 కోట్లకు చేరింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని ఇన్వెస్టర్లలో నమ్మకం, NDA పాలసీల కొనసాగింపు ఇందుకు కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News February 4, 2025
మీ ఇంట్లో సర్వే అయిందా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని, ఎవరూ తమ ఇంటికి రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంటికే కాదు తమ కాలనీల్లోని చాలా అపార్ట్మెంట్లలో సర్వే జరగలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజలు అందుబాటులో లేకపోవడంతో 3% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. మరి మీ ఇంట్లో సర్వే జరిగిందా? కామెంట్ చేయండి.
News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ: మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు
TG: ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. మాదిగ జనాభా 32,33,642గా పేర్కొని, రెండో గ్రూపులో చేర్చారు. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల తదితర కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వారిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి. గ్రూప్-1కు 1, గ్రూప్-2కు 9, గ్రూప్-3కి 5% రిజర్వేషన్లను సిఫారసు చేశారు.
News February 4, 2025
ప్రధాని మోదీ అమెరికా షెడ్యూల్ ఖరారు?
నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో మోదీ ఈ నెల 13న ట్రంప్తో భేటీ కానున్నారు. ఇరువురు దేశాధినేతలు ట్రేడ్, ట్యాక్స్, వీసా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలను మోదీ కలవనున్నారు. జనవరిలో రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు.