News September 17, 2024
ఏటా ప్రజాపాలన దినోత్సవం.. ఉత్తర్వులు జారీ

TG: ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల్లో జాతీయ జెండా ఎగురవేయాలని పేర్కొంది. ఇవాళ HYDలో సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్, బండి సంజయ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


