News December 4, 2024

ప్రజల తీర్పు బాధ్యతను పెంచింది: ఫడణవీస్

image

మహారాష్ట్ర ఎన్నికలు చారిత్రకమని ఆ రాష్ట్ర కాబోయే CM ఫడణవీస్ అన్నారు. తనను LP నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. తాజా ఎన్నికలు ‘ఏక్ హైతో సేఫ్ హై’ అని స్పష్టం చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని, వారి తీర్పు తమ బాధ్యతను పెంచిందన్నారు. హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ఫడణవీస్ CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Similar News

News December 3, 2025

ప్రైవేట్ సిబ్బందికి ‘IHIP పోర్టల్’ వినియోగంపై శిక్షణ

image

భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల వైద్య సిబ్బందికి ఐహెచ్‌ఐపి పోర్టల్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎం&హెచ్‌ఓ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ… పోర్టల్‌లో సిండ్రామిక్ సర్వైలెన్స్‌కు సంబంధించిన 22సిండ్రోములు, 33 వ్యాధుల వివరాలను ప్రతిరోజూ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అన్ని ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు.

News December 3, 2025

ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

image

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్‌గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్‌లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.

News December 3, 2025

రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

image

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.