News December 4, 2024
ప్రజల తీర్పు బాధ్యతను పెంచింది: ఫడణవీస్

మహారాష్ట్ర ఎన్నికలు చారిత్రకమని ఆ రాష్ట్ర కాబోయే CM ఫడణవీస్ అన్నారు. తనను LP నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. తాజా ఎన్నికలు ‘ఏక్ హైతో సేఫ్ హై’ అని స్పష్టం చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని, వారి తీర్పు తమ బాధ్యతను పెంచిందన్నారు. హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ఫడణవీస్ CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Similar News
News February 7, 2026
చెరువుగట్టు హుండీల లెక్కింపు.. గతేడాదికంటే అధికం

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. గట్టు క్రింద అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,79,467 కాగా, గట్టు పైన స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.22,34,770 నమోదైంది. మొత్తం 16 రోజుల హుండీ ఆదాయం రూ.26,14,237 కాగా, అన్నదానానికి రూ.46,739లు వచ్చాయి. గత సంవత్సరం ఆదాయంతో పోల్చితే ఈ సంవత్సరం రూ.9,69,137 అధికంగా వచ్చిందని ఈవో మోహన్ బాబు తెలిపారు.
News February 7, 2026
ADB: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.
News February 7, 2026
ADB: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.


