News September 13, 2024
ప్రభుత్వ వరద సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి: పురందీశ్వరి

AP: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. వరదల్లో, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. విజయవాడలోని కలెక్టరేట్లోనే ఉండి CM చంద్రబాబు తీసుకున్న చర్యలు ఆదర్శనీయమని కొనియాడారు. వరద ప్రాంతాలను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కృషి చేశారన్నారు. వారిని సన్మానించి, వస్త్రాలను అందించారు.
Similar News
News November 14, 2025
ఉసిరిలో తుప్పు తెగులు – నివారణ ఎలా?

ఉసిరిలో తుప్పు తెగులు సోకిన చెట్ల ఆకులపై తొలుత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇవి తుప్పు రంగుకు మారతాయి. వాటిని మనం చేతితో ముట్టుకుంటే ఆ రంగు మన చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశకు చేరే కంటే ముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 1ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి చెట్టుపై పిచికారీ చేయాలి.
News November 14, 2025
డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్రెడ్డి

TG: దేశ ప్రజలు కాంగ్రెస్కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.
News November 14, 2025
ఫలించని రాహుల్ యాత్ర.. అన్నింటా వెనుకంజ!

‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ఇటీవల బిహార్లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోటా కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్లో ఉండటం గమనార్హం.


