News March 25, 2024
ముఖ్య నేతలతో పురందీశ్వరి సమీక్ష

AP: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. ఇటు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
Similar News
News April 20, 2025
IPL: టాస్ గెలిచిన RCB

ముల్లాన్పూర్లో PBKSvsRCB మ్యాచ్లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొన్న తమ సొంత గ్రౌండ్లో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో RCB ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా ఉండొచ్చు.
PBKS: ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, బార్ట్లెట్, అర్షదీప్, చాహల్
RCB: సాల్ట్, కోహ్లీ, పటీదార్, రొమారియో, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్వుడ్, దయాళ్, సుయాశ్
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.