News May 20, 2024

BJD పాలనలో పూరీ జగన్నాథ్ ఆలయానికి రక్షణ లేదు: మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ్ టెంపుల్‌కు BJD పాలనలో రక్షణ లేదని విమర్శించారు. అక్కడి ‘రత్న భండార్’ తాళాలు ఆరేళ్లుగా కనిపించడం లేదన్నారు. ఒడిశా గౌరవం, భాష, కల్చర్ ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 28, 2025

స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

image

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్‌’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.

News November 28, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు వీరే

image

TG: హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దేశవిదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ఆనంద్ మహీంద్రా, UAE రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ అంతర్జాతీయ, టెక్ కంపెనీల CEOలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లూ రానున్నారు.