News May 20, 2024

BJD పాలనలో పూరీ జగన్నాథ్ ఆలయానికి రక్షణ లేదు: మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ్ టెంపుల్‌కు BJD పాలనలో రక్షణ లేదని విమర్శించారు. అక్కడి ‘రత్న భండార్’ తాళాలు ఆరేళ్లుగా కనిపించడం లేదన్నారు. ఒడిశా గౌరవం, భాష, కల్చర్ ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.

News November 21, 2025

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

image

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ 4 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MA (ELS/ELT/ఇంగ్లిష్), PhD, M.Phil ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించి ఉండాలి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/

News November 21, 2025

VIRAL: సముద్రంలో ఒంటరిగా 483 రోజులు!

image

సముద్రంలో ఒంటరిగా ఒక్క రోజు గడపడమే గగనం. అలాంటిది జోస్ సాల్వడార్ అనే మత్స్యకారుడు 483 రోజులు ఒంటరిగా గడిపిన ఘటనను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2012లో మెక్సికో తీరం నుంచి పడవలో బయలుదేరిన ఆయన తుఫానులో చిక్కుకుని 438 రోజులు పసిఫిక్ మహాసముద్రంలో గడిపారు. పచ్చి చేపలు, పక్షులు, వర్షపు నీరును తాగుతూ మనుగడ సాగించారు. బతకాలనే ఆశ బలంగా ఉంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఆయన నిరూపించారు.