News December 9, 2024
‘పుష్ప-2’: నాలుగు రోజుల్లో భారీగా కలెక్షన్లు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.829 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో అత్యంత వేగంగా రూ.800 కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. కాగా ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను కాస్త తగ్గించారు.
Similar News
News January 20, 2025
విశ్వవిజేతలుగా భారత్: తెలుగోడి కీలక పాత్ర
ఖో ఖో WCలో భారత మహిళల జట్టు విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ పాత్ర ఉంది. TGలోని పెద్దపల్లి(D) ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేశ్ జట్టుకు సహాయ కోచ్గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 2015లో కోచ్గా మారారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాగా అంచెలంచెలుగా జాతీయ జట్టుకు సహాయ కోచ్గా ఎదిగారు. స్కిల్ అనలైజర్గా ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో ఆయనదే ముఖ్య పాత్ర.
News January 20, 2025
ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
News January 20, 2025
కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే: భట్టి
TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.