News December 2, 2024

ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

image

పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్‌ రూ.800గా నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 17 వరకు గరిష్ఠంగా రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాసుకు రూ.100, అప్పర్ క్లాసుకు రూ.150 వరకు పెంచుకోవచ్చంది.

Similar News

News January 14, 2025

భారత క్రికెటర్లకు BCCI షాక్?

image

ఆస్ట్రేలియాతో BGT సిరీస్ వైఫల్యంతో BCCI ప్లేయర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడనుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్‌గా ఉంటారని కొందరు అంటుంటే.. ఒత్తిడి పెరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది కరెక్టేనా? మీ కామెంట్?

News January 14, 2025

‘గేమ్ ఛేంజర్’ హిందీ కలెక్షన్స్ ఎంతంటే?

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా హిందీ వెర్షన్‌కు 4 రోజుల్లో ₹29.01కోట్ల వసూళ్లు (నెట్) వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ₹8.64 కోట్లు రాగా, తర్వాతి 3 రోజుల్లో వరుసగా ₹8.43, ₹9.52, ₹2,42 వచ్చినట్లు పేర్కొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా తొలి రోజు ₹186కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందనేది వెల్లడించాల్సి ఉంది.

News January 14, 2025

జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

image

TG: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.