News December 23, 2024

పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే

image

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్‌ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.

Similar News

News October 27, 2025

మరోసారి భారత్‌ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

image

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్‌కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్‌ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్‌ఈస్ట్ స్టేట్స్‌పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.

News October 27, 2025

14,582 పోస్టులు… ఫలితాలు ఎప్పుడంటే…

image

SSC CGL టైర్1 ఫలితాల విడుదల తేదీపై అభ్యర్ధులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నవంబర్ చివరి వారంలో ఈ రిజల్ట్స్‌ను ప్రకటించవచ్చని కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ నౌ పేర్కొంది. NOV25న వచ్చే అవకాశముందని వివరించింది. ఈ పరీక్షల ప్రైమరీ కీపై అక్టోబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించి ఫలితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది హాజరయ్యారు.

News October 27, 2025

RAC సీట్లకు సగం ఛార్జీలు తిరిగి చెల్లించాలని డిమాండ్!

image

రైళ్లలో RAC ఛార్జీలపై ప్రయాణికులు SM వేదికగా విమర్శలు చేస్తున్నారు. సగం సైడ్ లోవర్ బెర్త్‌కు పూర్తి ఛార్జీ వసూలు చేయడం అన్యాయమని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు నిద్ర లేకుండా ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ట్ తయారైన వెంటనే RAC ప్రయాణికులకు సగం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని అమలు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?