News January 6, 2025
రేసింగ్ కేసు.. ఇవాళ విచారణకు కేటీఆర్!
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTR ఇవాళ ఉ.10.30 గం.లకు ACB ఎదుట హాజరుకానున్నారు. UKకు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ACB విచారణకు రావాలంటూ ఈనెల 3న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఈనెల 7న(రేపు) తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
Similar News
News January 14, 2025
అథ్లెట్పై అత్యాచారం.. 44 మంది అరెస్ట్
కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.
News January 14, 2025
గంభీర్ కోచ్ పదవికి ఎసరు?
త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపైనే హెడ్ కోచ్ గంభీర్ పదవీకాలం పొడిగింపు ఆధారపడి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. CT తర్వాత BCCI రివ్యూ నిర్వహించి నిర్ణయం తీసుకోనుందట. అందులోనూ భారత్ విఫలమైతే గంభీర్ను కోచ్గా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గతేడాది జులైలో గౌతీ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ ఇండియా 10 టెస్టుల్లో 6 ఓడిపోయింది. BGT సందర్భంగా చెలరేగిన వివాదాలు తెలిసినవే.
News January 14, 2025
మోదీని కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు: రాహుల్
ఢిల్లీలో అవినీతి, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రధాని మోదీ తరహాలో కేజ్రీవాల్ కూడా ప్రచారం, అబద్ధపు హామీల విధానాన్ని అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. ఆప్పై శాయశక్తులా పోరాడాలని, వైఫల్యాలను ఎత్తిచూపాలని, అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలన్నారు. మరోవైపు 2020లో కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క సీటూ గెలవలేదు.