News December 3, 2024
సంభల్కు రాహుల్, ప్రియాంక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733218933676_1124-normal-WIFI.webp)
యూపీలోని సంభల్లో మసీదు సర్వే సందర్భంగా అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పర్యటించనున్నారు. వీరితోపాటు మరో ఐదు పార్టీల నేతల బృందం బుధవారం అక్కడ పర్యటిస్తుంది. గత నెల 19న మోఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై CBI విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Similar News
News January 20, 2025
బంగాళదుంపలు రోజూ తింటున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737320999041_1226-normal-WIFI.webp)
బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.
News January 20, 2025
కొత్త ఫోన్తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737332853331_1226-normal-WIFI.webp)
బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కొరియర్లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.
News January 20, 2025
సంజయ్ రాయ్కి నేడు శిక్ష ఖరారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737178161816_1-normal-WIFI.webp)
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.