News December 17, 2024
మరోసారి వర్షం.. ఆగిన ఆట
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్కు వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. IND 105/5 స్కోర్ వద్ద ఉండగా వాన మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. నిన్న కూడా వర్షం వల్ల ఆట పూర్తిగా సాగలేదు. ఉదయం ఎండతో కూడిన పొడి వాతావరణం ఉంటున్నా తర్వాత ఆకాశం మేఘావృతమై వాన పడుతోంది. మరోవైపు వందకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ గట్టెక్కాలంటే వర్షం కొనసాగాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News January 13, 2025
GOOD NEWS: పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?
పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.
News January 13, 2025
పసుపు బోర్డుతో ఉపయోగాలివే
కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్లో దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. కాగా రేపు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు <<15148521>>ప్రారంభోత్సవం<<>> జరగనుంది.
News January 13, 2025
కౌశిక్ అరెస్ట్.. కరీంనగర్కు బీఆర్ఎస్ లీగల్ టీమ్
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 132, 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కరీంనగర్కు తరలిస్తున్న ఆయనను జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా కరీంనగర్ బయల్దేరింది.