News May 12, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని APSDMA తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పొలాల్లో పనిచేేసే రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు 18 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది.

Similar News

News April 10, 2026

రూ.4 లక్షలు జరిమానా.. 206 వాహనాల సీజ్: SP

image

జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 600కి పైగా వాహనాలను తనిఖీ చేసి, 326 వాహనాలకు రూ.4 లక్షల జరిమానా విధించినట్లు గుంటూరు SP వకుల్ జిందాల్ తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లతో పాటు పత్రాలు లేని 206 వాహనాలను సీజ్ చేశామన్నారు. మైనర్ల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

News April 10, 2026

యువతికి HIV రక్తం.. కథ విషాదాంతం!

image

TG: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని మనోహర్ అనే వ్యక్తి గత నెల 11న ఓ యువతికి తన HIV రక్తాన్ని ఎక్కించిన <<19380551>>విషయం<<>> తెలిసిందే. ఓ సినిమాలో చూపించినట్లుగా ఉన్న ఈ సైకో తరహా చర్యతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. నిందితుడి పైశాచికత్వానికి ఓ నిండు ప్రాణం బలైంది. అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

News April 10, 2026

ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

image

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్‌కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.