News April 10, 2025
మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం: స్కైమెట్

ఈ ఏడాది ‘నైరుతి’ వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ‘జూన్-సెప్టెంబరు మధ్య 868.6 సెం.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చు. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 30% ఎక్కువ వర్షపాతం ఉండొచ్చు. APలో ఉమ్మడి అనంతపురం, కర్నూల్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తప్పితే మిగతా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదవొచ్చు. మే నుంచే వానలు మొదలయ్యే ఛాన్స్ ఉంది’ అని పేర్కొంది.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.