News April 24, 2024

సియాచిన్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

image

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్‌నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్‌లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40ఏళ్లు గడిచాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్‌’తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

News October 15, 2025

ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

image

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్‌కౌంటర్లకు నాయకత్వం వహించారు.

News October 15, 2025

ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే!

image

క్రాసులా ఒవాటా అనే శాస్త్రీయ నామం గల ‘జేడ్’ ప్లాంట్ అదృష్టాన్ని, ఆర్థిక శ్రేయస్సును పెంపొందిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నాణెం ఆకారంలో ఉండే వీటి ఆకులు సంపదకు చిహ్నంగా భావిస్తారు. దీనిని ఆగ్నేయ దిశలో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెంచి ఒత్తిడి తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శాస్త్రీయంగా ఇది ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్‌గా పనిచేసి బెంజీన్ వంటి విషపదార్థాలను తొలగిస్తుంది. Share It