News April 24, 2024
సియాచిన్లో రాజ్నాథ్ సింగ్ పర్యటన
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40ఏళ్లు గడిచాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్దూత్’తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.
Similar News
News January 24, 2025
ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం
మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.
News January 24, 2025
RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ
AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు
TG: మీర్పేట్లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.