News August 2, 2024

ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి

image

AP: మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా విశాఖలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనలో మెట్రో డిజైన్లు, డీపీఆర్, నిర్మాణ పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.

Similar News

News March 20, 2026

బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే..

image

పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ నుంచే తల్లి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీలో తల్లి శార్డైన్స్, గుమ్మడి గింజలు, పాలకూర, బీట్ రూట్, దానిమ్మ, చికెన్, చిక్కుళ్లు, బ్రెజిల్ నట్స్, పల్లీలు, అవకాడో,గ్రీక్ యోగర్ట్ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, అయోడిన్ పిల్లల బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుందంటున్నారు.

News March 20, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘<<19423814>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ తొలి రోజు గ్రాస్ కలెక్షన్లు ₹37.17 కోట్లుగా నమోదైనట్లు Sacnilk వెబ్‌సైట్ వెల్లడించింది. దీంట్లో ₹31.50 కోట్లు నెట్ వసూళ్లని తెలిపింది. పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్, మేనరిజమ్స్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా మెరిశారు.

News March 20, 2026

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, శనివారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.