News November 12, 2024
ట్రంప్ పాలకవర్గంలో రామస్వామికి కీలక బాధ్యతలు?

ట్రంప్ US అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆయన పాలకవర్గంలో ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయనకు హోంల్యాండ్ సెక్యూరిటీ&ఇమ్మిగ్రేషన్ పాలసీని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వివేక్ చాలా తెలివైనవాడంటూ ప్రశంసించిన ట్రంప్ అతడి స్థానం ఏంటో ఇప్పుడే చెప్పలేనన్నారు.
Similar News
News September 15, 2025
ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్

AP: 1923 – 2019 వరకు రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలుంటే, తమ హయాంలో 17 కాలేజీలను సంకల్పించామని YCP చీఫ్ జగన్ అన్నారు. ‘2023 SEP 15న VZM, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. పాడేరు, పులివెందుల కళాశాలలను అడ్మిషన్లకు సిద్ధం చేశాం. మిగతా కాలేజీల పనులు చేయకుండా వాటిని ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం. ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News September 15, 2025
వేధింపులతో ఉద్యోగి సూసైడ్.. రూ.90 కోట్ల పరిహారం

జపాన్లో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగినికి కోర్టు రూ.90 కోట్ల పరిహారం ప్రకటించింది. 2023లో సతోమి(25)కి వర్క్ ప్లేస్లో వేధింపులు ఎదురయ్యాయి. 2021లో ఆ కంపెనీ ప్రెసిడెంట్ బాధిత యువతిని ‘వీధి కుక్క’ అని తిట్టారు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారు. 2023లో మరణించారు. ఆమె మరణంపై యువతి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా రూ.90 కోట్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
News September 15, 2025
రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించండి: తుమ్మల

TG: రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రి యూరియా కేటాయింపులు వీలైనంత త్వరగా చేయాలని విన్నవించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని ఆయన మంత్రికి వివరించారు. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రజత్ కుమార్ తెలిపారు.