News September 26, 2024

రామాయణం పాఠ్యపుస్తకాల్లో ఉండాలి: వెంకయ్య నాయుడు

image

AP: రామాయణ స్ఫూర్తిని భావితరాలకు అందించడం సంతోషంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేయాల్సిన అవసరముందని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు సెక్యులర్ పేరు చెబుతున్నారని విమర్శించారు.

Similar News

News October 26, 2025

అల్పపీడనం, వాయుగుండం అంటే?

image

సముద్రంపై ఉండే వేడి గాలులు నీటి బిందువులను ఆవిరిగా మార్చి తక్కువ పీడనం ఉన్న వైపునకు పయనిస్తాయి. దీన్ని అల్పపీడన ద్రోణి అని అంటారు. ఈ ద్రోణి నీటి బిందువులను ఆకర్షిస్తూ అల్పపీడనంగా మారుతుంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు వస్తుంది. ఆపై వాయుగుండం(31-50Kmph గాలులు)గా, మరింత బలపడితే తీవ్ర వాయుగుండం(51-62kmph గాలులు)గా ఛేంజ్ అవుతుంది. గాలుల వేగం 62Kmph దాటితే తుఫానుగా పరిగణిస్తారు.

News October 26, 2025

స్టార్ క్యాంపెయినర్స్‌గా సోనియా, రాహుల్, ప్రియాంక

image

బిహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌ రిలీజ్ చేసింది. ఇందులో పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు KC వేణుగోపాల్, భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్ తదితరుల పేర్లనూ చేర్చింది. NOV 6, 11 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News October 26, 2025

రేపు ఉదయం 11గంటలకు..

image

TG: మద్యం దుకాణాల లైసెన్స్‌ల ఎంపిక లాటరీ పద్ధతిలో రేపు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహణ జరగనుంది. మద్యం దుకాణాల లాటరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్‌లో 100 మద్యం దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్‌నగర్‌లో 134 మద్యం షాపులకు 7,845 అప్లికేషన్లు వచ్చాయి.