News April 12, 2024

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ప్రధాన నిందితుడు అరెస్ట్

image

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత అతడు అస్సాం, పశ్చిమబెంగాల్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News March 25, 2025

ఈ IPL సీజన్‌లో వారిదే హవా..!

image

IPL 2025లో జట్లు మారిన ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇప్పటివరకు 4 మ్యాచులు జరగ్గా అన్నిట్లోనూ ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లే POTMగా నిలిచారు. వీరిలో కృనాల్ పాండ్య (RCB), ఇషాన్ కిషన్ (SRH), నూర్ అహ్మద్ (CSK), అశుతోశ్ శర్మ (DC) ఉన్నారు. గత సీజన్‌లో వీరు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సీజన్‌లో జట్టు మారగానే విధ్వంసం సృష్టిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు.

News March 25, 2025

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణ

image

TG: BRS MLA పాడి కౌశిక్ వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై SCలో విచారణ మొదలైంది. కౌశిక్ తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ‘ముగ్గురు MLAలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోలేదు. సుప్రీం జోక్యం చేసుకున్న తర్వాతే నోటీసు ఇచ్చారు. వాటిపై ఎమ్మెల్యేలు వారంలో సమాధానం ఇవ్వాలి. కానీ ఇప్పటికి 3 వారాలైనా వారు స్పందించడంలేదు’ అని జడ్జి జస్టిస్ గవాయ్ దృష్టికి తీసుకెళ్లారు.

News March 25, 2025

బెట్టింగ్ యాప్ కేసులో కొత్త మలుపు

image

నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ <<15822419>>కేసులో<<>> కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులని కూడా నిందితులుగా చేర్చారు. సెలబ్రిటీలను విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకోనున్నారు. తొలుత యాప్ నిర్వాహకులను విచారించనున్నారు. తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని ముందుగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం యాప్‌ల నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

error: Content is protected !!