News December 3, 2024

రామ్మోహన్ నాయుడు రికార్డు

image

అతి పిన్న వయసులోనే పార్లమెంటులో ముందు వరుసలో కూర్చునే అరుదైన రికార్డును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆయన తండ్రి ఎర్రన్నాయుడు పేరుతో ఉండేది. కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలకు మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. తెలుగు వారికి, శ్రీకాకుళం ప్రజలకు దక్కిన గౌరవంగా రామ్మోహన్ నాయుడు దీన్ని అభివర్ణించారు.

Similar News

News January 12, 2026

ఇతిహాసాలు క్విజ్ – 125 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?
జవాబు: దుర్యోధనుడు విషమిచ్చి నదిలో పడేయగా, భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు వాసుకి భీముడిని తన మనువడిగా గుర్తించి, దివ్య రసాన్ని ప్రసాదించాడు. ఆ అమృత రసం తాగడం వల్లే భీముడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతోనే ఆయన ఎందరో బలవంతులను, కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 12, 2026

చిరు-బాలయ్య కాంబో సాధ్యమేనా?

image

మన శంకరవరప్రసాద్ గారు మూవీలో సీనియర్ స్టార్లు చిరంజీవి, వెంకటేశ్ చేసిన సందడికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ మూవీ చేయాలనుందని గతంలో చిరంజీవి చెప్పారు. రామ్ చరణ్, జూ.NTRతో రాజమౌళి తీసిన RRR ప్రపంచవేదికపై సత్తా చాటింది. ఇప్పుడు చిరు-బాలయ్య సినిమా వస్తే పండగేనని ఫ్యాన్స్ అంటున్నారు. మీరేమంటారు?

News January 12, 2026

మెస్సీ ఓ మాట చెప్పాడంతే.. ₹లక్ష కోట్లు పెరిగిన సంపద!

image

సెలబ్రిటీలు చేసే చిన్న పనులు కూడా కొన్ని కంపెనీలపై భారీ ప్రభావం చూపిస్తాయి. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ క్యాజువల్‌గా చెప్పిన మాట కోకా-కోలాకు సిరులు కురిపించింది. ‘నాకు వైన్ అంటే ఇష్టం. స్ర్పైట్ కలుపుకుని తాగుతా’ అని ఆయన చెప్పారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా ఎగిశాయి. 3రోజుల్లో 12.9బిలియన్ డాలర్ల(₹1.16లక్షల కోట్లు) సంపద పెరిగింది. 2021లో రొనాల్డో కోకా-కోలా ప్రొడక్టును పక్కనపెట్టడంతో $4Bను కోల్పోయింది.